9.24.2013

AN APPEAL TO FACEBOOK TIGERS

రోగం గనేరియా ఐతే డయేరియా కు వైద్యం చేస్తున్నారు మన మేధావులు....
ఈ దేశంలో అవినీతి వ్యవస్తీకృత లోపం...
వ్యవస్థ సంస్కరించబడాలని కోరుకోకుండా సామాజిక వర్గాలుగా విడిపోయి వ్యక్తుల మీద పడి ఏడుస్తున్నారు మన ఎఫ్.బీ మేధావులు....
అవినీతికి పాల్పడింది జగనా,చంద్ర బాబా,మరోకరా అన్నది అప్రస్తుతం....
అవినీతికి ఉతమిచ్చే వ్యవస్థ ఉన్నదన్నది సుస్వస్టం....
అసలింకో గొప్ప విషయం ఉందిక్కడ....
ఈ దేశంలోఅరవై ఏళ్ళ నుంచి ఒక్క శాతం కుడా రేటు పెరగని రంగం ఒక్క అవినీతే....
పాలకులేవరైనా,పార్టీలు ఏవైనా అవినీతి నిర్దిష్ట శాతాన్ని దాటలేదు...
పెరిగిన బడ్జెట్ తో పాటు అవినీతితో సంపాదించే మొత్తాలు పెరిగాయి....అంతే!
ఈ దేశంలో ప్రత్యక్ష పాలనా వ్యవస్థ రాకుండా,అధికార వికేంద్రీకరణ జరగకుండా,పాలకుల జవాబుదారీని పర్యవేక్షించే ప్రజా వ్యవస్తలు అభివృద్ధి జరగకుండా అవినీతిని రూపుమాపడం అసాధ్యం...!

చావు బేరం



విద్యార్ధి ఆత్మహత్య
చానలోడికి సెన్సేషనల్ న్యుసేమీ కాదు.
పత్తి రైతు ఆత్మహత్య
పేపరోడు లక్షన్నొకటోసారి రాసే ఇంపోజిషన్ మాత్రమే.
సకుటుంబ సపరివారంగా ఉరేసుకుంటే
అరగంట ప్రాయోజిత కార్యక్రమం.

బతకలేని బతుకుల లెక్క
బలవంతపు చావుల లెక్క
సరిసమానమైన సంధి యుగంలో మనమున్నాం...
ఐనా భయం వలదు
వెల లేని జీవితాలకు
ప్రభుత్వం వారి కనీస మద్దతు ధర
అక్షరాలా లక్ష రూపాయలు...
ఏ చానలోడి పుణ్యంతోనో
ఏ పేపరోడి సౌజన్యంతోనో

ఏ నాయకుడి దాక్షిణ్యంతోనో
మీ చావు సెన్సేషనల్ ఐతే
గరిష్ట మద్దతు ధర ఐదు లక్షలు...!
మామంచి చావు బేరం
ఆలశించిన ఆశాభంగం.