9.15.2013

ఆత్మతో పాటు దేహమూ శాశ్వితమే.........



చెట్టు నుంచి నేల మీద పడ్డ విత్తనం గాలిని,నీతిని,వివిద ధాతువుల్ని గ్రహించి మొలకగా,మొక్కగా,వృక్షంగా ఎదుగుతుంది.
అదే చెట్టు చనిపోయినప్పుడు వివిధ ధాతువులుగా తిరిగి ప్రకృతిలో కలసిపోతుంది.
వివిధ ధాతువులు ఒక రూపంగా,ఒక రూపం వివిధ ధాతువులుగా నిరంతరం ఒక భ్రమణం జరుగుతుందే తప్ప ఈ లోకంలో ఏవీ కొత్తగా సృష్టించబడవు...నాశనమూ కావు.
గీతా జ్ఞానం మేరకు ఆత్మ మాత్రమే శాశ్వితం...దేహం అశాశ్వితం.
నా జ్ఞానం మేరకు దేహమూ ఆత్మా రెండూ శాశ్వితమే....!
దేహం వివిధ ధాతువులుగా రూపాంతరం చెందుతూ ఈ ప్రకృతిలోనే వుంటుంది కాబట్టి అది శాశ్వితం.
ఆత్మ అంటే దేహ చైతన్యమనే ప్రాణ శక్తి...
ఆ చైతన్యం దేహాన్ని వీడడమే మరణం...
భౌతికశాస్త్ర నియమాలననుసరించి శక్తి రూపం మార్చుకుంటుందే కాని నాశనం కాదు...
కావున ఆత్మకూడా శాశ్వితమే....!
దేహ ఆత్మలు రెండూ ప్రకృతి అనే పరమాత్మలో శాశ్విత భ్రమనాలు.....!

No comments:

Post a Comment